నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- August 30, 2026
అబుదాబి: నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనలతో ప్రభావితమైన ప్రజలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యవసర సహాయాన్ని అందించింది. యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 83 టన్నుల సహాయ సామగ్రితో ప్రత్యేక విమానాన్ని నేపాల్కు పంపింది.
ఈ సహాయంలో ఆహార పదార్థాలతో పాటు టెంట్లు, ఆశ్రయ సామగ్రి, ఇతర మానవతా అవసరాలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇటీవల నేపాల్లోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలు, కొండచరియల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఇంకా పలువురు ఆచూకీ తెలియకపోవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు బాధితుల సహాయార్థం 10 మిలియన్ అమెరికన్ డాలర్లను కేటాయించారు. అత్యవసర పరిస్థితుల్లో అన్ని వయసుల ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు, బాధిత ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ, స్థిరత్వానికి ఈ నిధులను వినియోగించనున్నారు.
నేపాల్లోని యూఏఈ రాయబార కార్యాలయంతో కలిసి యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది. బాధితులకు సహాయ సామగ్రిని వేగంగా చేరవేసేలా చర్యలు చేపడుతోంది.
అదేవిధంగా, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత బలోపేతం చేసేందుకు సంబంధిత అంతర్జాతీయ సంస్థలతోనూ యూఏఈ సమన్వయం కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!







