మే 13న నాలుగో విడత పోలింగ్..
- May 03, 2024
న్యూ ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్ 10 రాష్ట్రాల్లో జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుందని, 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది. మొత్తం 4264 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన తర్వాత 1970 మిగిలాయని.. ఉపసంహరణ గడువు తర్వాత 1717 మంది పోటీలో నిలిచారని వివరించింది. రాష్ట్రాలవారీగా 96 పార్లమెంట్ స్థానాలకు ఎంత మంది పోటీ చేస్తున్నారనే వివరాలను శుక్రవారం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది పోటీ
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 525 మంది పోటీ
బిహార్ లో 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీ
జమ్మూ కాశ్మీర్లో ఒక్క పార్లమెంట్ స్థానానికి బరిలో 24 మంది
జార్ఖండ్లో 4 పార్లమెంట్ స్థానాలకు 45 మంది పోటీ
మధ్యప్రదేశ్లో 8 పార్లమెంట్ స్థానాలకు 74 మంది పోటీ
మహారాష్ట్రలో 11 పార్లమెంట్ స్థానాలకు బరిలో 298 మంది
ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు బరిలో 37 మంది
ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకు బరిలో 130 మంది
వెస్ట్ బెంగాల్లో 8 పార్లమెంట్ స్థానాలకు 75 మంది పోటీ
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









