అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- May 05, 2024
అబుదాబి: ఈరోజు అనగా ఆదివారం 5 మే 2024 నాడు మా గల్ఫ్ కార్మికులం అందరం కలిసి యూఏఈలో మన తెలంగాణలో మరియు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి గెలిచి నరేంద్ర మోడీ ని మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని అబుదాబిలో ఉన్నటువంటి BAPS హిందూ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇరుదేశాల దౌత్య పరమైన సంబంధాల సందర్భంగా ఈ దేశంలో ఒక మంచి ఆలయం నిర్మించి ఇచ్చినటువంటి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరుగుతుంది.అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ సంబంధాలు మెరుగుపరిచి ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడాలని అదేవిధంగా మేము అందరం బాగుపడాలని ఆశిస్తున్నాం.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఇండ్ల కు ఫోన్ చేసి ప్రత్యేకంగా బంధువులకు,స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో కుంభాల మహేందర్ రెడ్డి, ఆరే శరత్ గౌడ్,పెనుకుల అశోక్, పవన్ సాయి, శ్రీను, ప్రశాంత్,సాయి,దేవన్న, ఎండపెల్లి తిరుపతి పటేల్,రమేష్,నవీన్,తిరుపతి లతో పాటుగా సుమారు 100 మంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









