అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు

- May 05, 2024 , by Maagulf
అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు

అబుదాబి: ఈరోజు అనగా ఆదివారం 5 మే 2024 నాడు మా గల్ఫ్ కార్మికులం అందరం కలిసి యూఏఈలో మన తెలంగాణలో మరియు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి గెలిచి నరేంద్ర మోడీ ని మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని అబుదాబిలో ఉన్నటువంటి BAPS  హిందూ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇరుదేశాల దౌత్య పరమైన సంబంధాల సందర్భంగా ఈ దేశంలో ఒక మంచి ఆలయం నిర్మించి ఇచ్చినటువంటి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరుగుతుంది.అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ సంబంధాలు మెరుగుపరిచి ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడాలని అదేవిధంగా మేము అందరం బాగుపడాలని ఆశిస్తున్నాం.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఇండ్ల కు ఫోన్ చేసి ప్రత్యేకంగా బంధువులకు,స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో కుంభాల మహేందర్ రెడ్డి, ఆరే శరత్ గౌడ్,పెనుకుల అశోక్, పవన్ సాయి, శ్రీను, ప్రశాంత్,సాయి,దేవన్న, ఎండపెల్లి తిరుపతి పటేల్,రమేష్,నవీన్,తిరుపతి లతో పాటుగా సుమారు 100 మంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com