ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- May 06, 2024దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఉమ్మ్ రామూల్ మరియు అల్ బార్షా కేంద్రాలను స్మార్ట్, హైబ్రిడ్ హబ్లుగా మార్చే పని ప్రారంభించింది. ఈ రెండు కేంద్రాలు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంతటా సేవలను అందిస్తూనే ఉంటాయని, ఎటువంటి అంతరాయం ఉండదని అధికార RTA తెలిపింది. ఉమ్మ్ రామూల్ మరియు అల్ బార్షా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు మానవ ప్రమేయం లేకుండా స్మార్ట్ పరికరాల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండే సేవలను అందించగలవని, సేవా సలహాదారులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఈ సెప్టెంబర్లో పూర్తవుతుందని డైరెక్టర్ జనరల్ మరియు బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ అల్ టేయర్ అన్నారు. గత రెండేళ్లలో మరో మూడు కేంద్రాలను స్మార్ట్ హబ్లుగా మార్చినట్లు తెలిపారు. నవంబర్ 2022లో అల్ కిఫాఫ్ సెంటర్, మార్చి 2023లో అల్ మనారా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ మరియు అదే సంవత్సరం మేలో అల్ తవార్ సెంటర్ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం దీరా సెంటర్ను హైబ్రిడ్ సెంటర్గా మార్చడంతో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందని అల్ టేయర్ చెప్పారు. దీంతో ఆయా కేంద్రాల్లో లభించే సేవల పరిధి కూడా 78 నుంచి 213కి పెరగనుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ