సోంపు గింజల్ని జీలకర్రతో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది.?
- May 13, 2024
సోంపు, జీలకర్ర ఏదైనా సరే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి దోహదపడతాయ్. కమ్మని భోజనం కడుపు నిండా తినేశాకా, ఆఖరిలో సోంపును తింటాం.
సోంపు తినడం వల్ల పంటి శుభ్రంతో పాటూ, కడుపు కూడా శుభ్రం అవుతుంది. ఎంత ఎక్కువగా తిన్నా ఆహారం ఈజీగా జీర్ణమైపోవడానికి సోంపు గింజలు సహాయ పడతాయ్.
సోంపులోని థైమోల్ జీర్ణ కండరాలను సడలించడం.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. జీలకర్రతో కలిపి సోంపును తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పూట నానబెట్టిన సోంపు, జీలకర్ర నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా వుండడంతో పాటూ, కొవ్వు కూడా కరుగుతుంది.
అంతేకాదు, బరువు తగ్గించే క్రమంలో వర్కవుట్లు చేసేవారు సైతం ఈ నీటిని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
అంతేకాదు, సోంపును రోజూ తినడం వల్ల దంతాల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. సో, సువాసనలూరే సోంపును కేవలం విందు భోజనాల్లో మాత్రమే కాదండోయ్. ప్రతీరోజూ భుజించొచ్చు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







