సోంపు గింజల్ని జీలకర్రతో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది.?
- May 13, 2024
సోంపు, జీలకర్ర ఏదైనా సరే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి దోహదపడతాయ్. కమ్మని భోజనం కడుపు నిండా తినేశాకా, ఆఖరిలో సోంపును తింటాం.
సోంపు తినడం వల్ల పంటి శుభ్రంతో పాటూ, కడుపు కూడా శుభ్రం అవుతుంది. ఎంత ఎక్కువగా తిన్నా ఆహారం ఈజీగా జీర్ణమైపోవడానికి సోంపు గింజలు సహాయ పడతాయ్.
సోంపులోని థైమోల్ జీర్ణ కండరాలను సడలించడం.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. జీలకర్రతో కలిపి సోంపును తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పూట నానబెట్టిన సోంపు, జీలకర్ర నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా వుండడంతో పాటూ, కొవ్వు కూడా కరుగుతుంది.
అంతేకాదు, బరువు తగ్గించే క్రమంలో వర్కవుట్లు చేసేవారు సైతం ఈ నీటిని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
అంతేకాదు, సోంపును రోజూ తినడం వల్ల దంతాల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. సో, సువాసనలూరే సోంపును కేవలం విందు భోజనాల్లో మాత్రమే కాదండోయ్. ప్రతీరోజూ భుజించొచ్చు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









