ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- May 15, 2024
దోహా, ఖతార్: “ఏ ఛేంజింగ్ వరల్డ్-ట్రావెర్సింగ్ ది అన్నౌన్ ” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ నాల్గవ ఎడిషన్ను అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫెయిర్మాంట్లోని కతారా టవర్స్లో ప్రారంభించారు. ఫోరమ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ప్రసంగించారు. హిస్ హైనెస్ అమీర్, ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ప్రారంభ సెషన్ను, పోలాండ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఆండ్రెజ్ దుడాతో మరొక డైలాగ్ సెషన్ను కూడా అమీర్ వీక్షించారు. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో మరొక డిస్కషన్ సెషన్ జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ఖతార్, విదేశాల ఉన్నత మంత్రులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల అధిపతులు, సీనియర్ అధికారులు మరియు పార్లమెంటేరియన్లు, మేధావులు, ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







