ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- May 15, 2024
దోహా, ఖతార్: “ఏ ఛేంజింగ్ వరల్డ్-ట్రావెర్సింగ్ ది అన్నౌన్ ” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ నాల్గవ ఎడిషన్ను అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫెయిర్మాంట్లోని కతారా టవర్స్లో ప్రారంభించారు. ఫోరమ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ప్రసంగించారు. హిస్ హైనెస్ అమీర్, ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ప్రారంభ సెషన్ను, పోలాండ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఆండ్రెజ్ దుడాతో మరొక డైలాగ్ సెషన్ను కూడా అమీర్ వీక్షించారు. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో మరొక డిస్కషన్ సెషన్ జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ఖతార్, విదేశాల ఉన్నత మంత్రులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల అధిపతులు, సీనియర్ అధికారులు మరియు పార్లమెంటేరియన్లు, మేధావులు, ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









