ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- May 15, 2024
దోహా, ఖతార్: “ఏ ఛేంజింగ్ వరల్డ్-ట్రావెర్సింగ్ ది అన్నౌన్ ” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ నాల్గవ ఎడిషన్ను అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫెయిర్మాంట్లోని కతారా టవర్స్లో ప్రారంభించారు. ఫోరమ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ప్రసంగించారు. హిస్ హైనెస్ అమీర్, ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ప్రారంభ సెషన్ను, పోలాండ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఆండ్రెజ్ దుడాతో మరొక డైలాగ్ సెషన్ను కూడా అమీర్ వీక్షించారు. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో మరొక డిస్కషన్ సెషన్ జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ఖతార్, విదేశాల ఉన్నత మంత్రులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల అధిపతులు, సీనియర్ అధికారులు మరియు పార్లమెంటేరియన్లు, మేధావులు, ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









