'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- May 16, 2024
యూఏఈ: గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ సమగ్రతను కాపాడటంలో అత్యంత సీరియస్గా ఉన్నట్లు యూఏఈ ప్రకటించింది. ఇటీవల మనీ లాండరింగ్పై పోరాడుతున్న అంతర్జాతీయ సంస్థ నుండి ప్రశంసలు కూడా పొందినట్లు యూఏఈ అధికారి ఒకరు వెల్లడించారు. "ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో కొంతమందికి సురక్షితమైన స్వర్గధామంగా దుబాయ్ ఉంది. కొంతవరకు దాని రియల్ ఎస్టేట్ రంగం అందించే గోప్యత కారణంగా" అని పేర్కొన్న ఒక నివేదికను తీవ్రంగా తప్పుబట్టారు. గ్లోబల్ క్రిమినల్స్ అని పిలవబడే వారిని అడ్డుకోవడంలో యూఏఈ ముందువరుసలో ఉంటుందన్నారు. ఫిబ్రవరిలో (ఈ సంవత్సరం), మనీలాండరింగ్తో పోరాడటానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (FATF) ప్రశంసించిందని తెలిపారు. యూఏఈ అమలు చేయబడిన చట్టపరమైన నిబంధనల ప్రకారమే దుబాయ్ లో ఆస్తుల కొనుగోలు ప్రతిపాదనపై సంతకం చేసినప్పుడు అతను/ఆమె తన పాస్పోర్ట్ కాపీలు మరియు ఎమిరేట్స్ IDతో సహా అతని/ఆమె అన్ని పత్రాలను అందించాలి. తాము కొనుగోలుదారు యొక్క గుర్తింపు మరియు వారి నిధుల మూలానికి సంబంధించిన సమాచారాన్ని మరియు డిపాజిట్ కోసం చెల్లింపును కఠినంగా పరిశీలిస్తామని అజీజీ డెవలప్మెంట్స్ సీఈఓ ఫర్హాద్ అజీ వెల్లడించారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







