ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- May 18, 2024
న్యూ ఢిల్లీ: కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరిగిన తీరు కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ హాస్టల్లో జరిగిన మూకదాడుల్లో పలువురు పాకిస్థానీ విద్యార్థులు గాయపడ్డారు. దీంతో కిర్గిజ్స్థాన్లోని భారత పౌరులు ఇళ్లలోనే ఉండాలని ఇండియా సూచించింది.
తాము భారతీయ విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని కిర్గిజ్స్థాన్లోని భారత కాన్సులేట్ ఎక్స్ లో పేర్కొంది. అయినప్పటికీ విద్యార్థులు ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎంబసీని సంప్రదించాలని సూచించింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా దీనిపై స్పందించారు. రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్లో ఉండాలని భారత విద్యార్థులకు ఆయన సూచించారు. కాగా, పాకిస్థాన్ విద్యార్థులపై జరిగిన దాడులపై పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ కూడా స్పందించారు.
కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్లో పాకిస్థానీ విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు. అవసరమైన సాయం అందించాలని తాను పాక్ రాయబారిని ఆదేశించానని చెప్పారు. తన కార్యాలయం కూడా ఎంబసీతో టచ్లో ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..