ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- May 18, 2024
న్యూ ఢిల్లీ: కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరిగిన తీరు కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ హాస్టల్లో జరిగిన మూకదాడుల్లో పలువురు పాకిస్థానీ విద్యార్థులు గాయపడ్డారు. దీంతో కిర్గిజ్స్థాన్లోని భారత పౌరులు ఇళ్లలోనే ఉండాలని ఇండియా సూచించింది.
తాము భారతీయ విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని కిర్గిజ్స్థాన్లోని భారత కాన్సులేట్ ఎక్స్ లో పేర్కొంది. అయినప్పటికీ విద్యార్థులు ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎంబసీని సంప్రదించాలని సూచించింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా దీనిపై స్పందించారు. రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్లో ఉండాలని భారత విద్యార్థులకు ఆయన సూచించారు. కాగా, పాకిస్థాన్ విద్యార్థులపై జరిగిన దాడులపై పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ కూడా స్పందించారు.
కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్లో పాకిస్థానీ విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు. అవసరమైన సాయం అందించాలని తాను పాక్ రాయబారిని ఆదేశించానని చెప్పారు. తన కార్యాలయం కూడా ఎంబసీతో టచ్లో ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







