బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- May 18, 2024
అమరావతి: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న ఘటనలపై స్పందించిన ఈసీ సీరియస్గా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని గతంలో పోలీసులు కూడా చెప్పారు. ఇక ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో మరోసారి ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల, డీజిల్ను బాటిళ్లలో అమ్మొద్దని యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు.. పోలీసుల సూచనతో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కూడా అలర్ట్ అయ్యాయి. మరోవైపు వాహనాల్లో పెట్రోల్ ఉన్నట్లుండి అయిపోతే ఏంటి పరిస్థితి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







