భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- May 19, 2024
భారత్ లో రేపు (సోమవారం) లోక్సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగనుంది. అందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్లోని 14, మహారాష్ట్రలోని 13 స్థానాల్లో అత్యధికంగా ఓటింగ్ జరుగుతోంది. ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూకశ్మీర్లో ఒకటి, లడఖ్లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
కాగా.. ఐదో దశలో పలువురు ప్రముఖ రాజకీయ నేతల భవిష్యత్ ఓటర్ల చేతిలో ఉంది. ఐదో దశంలో పోటీ చేసే వారిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, రోహిణి ఆచార్య, ఒమర్ అబ్దుల్లా, పీయూష్ గోయల్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
ఇప్పటివరకు జరిగిన 4 దశల పోలింగ్ తో 379 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. కాగా.. ఐదో దశ లోక్సభ ఎన్నికల్లో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నెల 25న ఆరో దశ, జూన్ 1న ఏడో విడత పోలింగ్తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









