కీరవాణి వ్యవహారం పై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

- May 28, 2024 , by Maagulf
కీరవాణి వ్యవహారం పై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేసిన జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే కీరవాణి మూలాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కావడంతో ఈ విషయం మీద ట్రోలింగ్ జరుగుతోంది. తెలంగాణ ఆత్మగౌరవంగా భావించే రాష్ట్ర గీతానికి ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలా మ్యూజిక్ ఇస్తారు అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అయితే ఇప్పటికే రికార్డింగ్ సెషన్స్ కూడా మొదలైనట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద స్పందించారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం, రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదు అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com