ఒమన్లో మండుతున్న ఎండలు.. హెచ్చరికలు జారీ
- June 01, 2024
మస్కట్: ఒమన్లో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ఉండటానికి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఒమన్ వాతావరణ శాఖ సూచించింది. " అధిక ఉష్ణోగ్రతల కారణంగా దయచేసి డైరెక్ట్ గా ఎండలోకి రావొద్దు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వడదెబ్బ తగిలే అవకాశం అధికంగా ఉంటుంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి." అని సూచించింది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో నేరుగా ఎండలో పనిచేయవద్దని,డీ హైడ్రేషన్ ను నివారించడానికి తగినంత మంచి నీరు తాగాలని, అధిక ఉష్ణోగ్రతలకు గురైతే ఎలా స్పందించాలో కార్మికులు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం మంచిదని తన సూచనల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం
- ఏపీ ప్రభుత్వం జొమాటోకు రూ.9.63 కోట్ల ఫైన్!
- GHIAL తెలంగాణ ప్రభుత్వానికి ₹12.28 కోట్ల డివిడెండ్ చెల్లింపు









