జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్
- June 01, 2024
యూఏఈ: యూఏఈలో జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్ అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వరుసగా 20వ సంవత్సరం కూడా వర్క్ బ్రేక్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. యూఏఈ అంతటా మధ్యాహ్నం 12.30 నుండి 3.00 గంటల మధ్య డైరెక్ట్ సూర్యకాంతిలో, బహిరంగ ప్రదేశాలలో పని చేయడం నిషేధం. మధ్యాహ్న విరామ సమయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి అధికారులు 5,000 దిర్హామ్ల జరిమానా విధిస్తారు. విరామ సమయంలో పలువురు ఉద్యోగులు పని చేస్తే 50,000 దిర్హామ్ల ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. అయితే, కొన్ని ఉద్యోగాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఉందని అధికారులు పేర్కొన్నారు. నీటి సరఫరా లేదా విద్యుత్తు, ట్రాఫిక్ను నిలిపివేయడం, రోడ్డు పనులపై తారు వేయడం లేదా కాంక్రీటు పోయడం మరియు ప్రాథమిక సేవలకు సంబంధించిన ఇతర పనులు మధ్యాహ్న విరామ సమయంలో కూడా పని కొనసాగించవచ్చని తెలిపారు. కాగా, విరామ సమయంలో పని కొనసాగించడానికి కంపెనీలు అనుమతి కోసం అప్లే చేసుకోవాలని సూచించారు. డైరెక్ట్ సూర్యకాంతిలో పనిచేసే ఉద్యోగులను రక్షించడానికి యజమానులు పారాసోల్లు, షేడెడ్ ఏరియాల వంటి వాటని సమకూర్చాలి. జాబ్ సైట్లలో ఫ్యాన్లు మరియు తగినంత తాగునీరు, అలాగే ప్రథమ చికిత్స పరికరాలను అందుబాటులో పెట్టాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ (MoHRE) మంత్రిత్వ శాఖలో తనిఖీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మొహ్సిన్ అల్ నస్సీ వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









