జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్
- June 01, 2024
యూఏఈ: యూఏఈలో జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్ అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వరుసగా 20వ సంవత్సరం కూడా వర్క్ బ్రేక్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. యూఏఈ అంతటా మధ్యాహ్నం 12.30 నుండి 3.00 గంటల మధ్య డైరెక్ట్ సూర్యకాంతిలో, బహిరంగ ప్రదేశాలలో పని చేయడం నిషేధం. మధ్యాహ్న విరామ సమయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి అధికారులు 5,000 దిర్హామ్ల జరిమానా విధిస్తారు. విరామ సమయంలో పలువురు ఉద్యోగులు పని చేస్తే 50,000 దిర్హామ్ల ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. అయితే, కొన్ని ఉద్యోగాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఉందని అధికారులు పేర్కొన్నారు. నీటి సరఫరా లేదా విద్యుత్తు, ట్రాఫిక్ను నిలిపివేయడం, రోడ్డు పనులపై తారు వేయడం లేదా కాంక్రీటు పోయడం మరియు ప్రాథమిక సేవలకు సంబంధించిన ఇతర పనులు మధ్యాహ్న విరామ సమయంలో కూడా పని కొనసాగించవచ్చని తెలిపారు. కాగా, విరామ సమయంలో పని కొనసాగించడానికి కంపెనీలు అనుమతి కోసం అప్లే చేసుకోవాలని సూచించారు. డైరెక్ట్ సూర్యకాంతిలో పనిచేసే ఉద్యోగులను రక్షించడానికి యజమానులు పారాసోల్లు, షేడెడ్ ఏరియాల వంటి వాటని సమకూర్చాలి. జాబ్ సైట్లలో ఫ్యాన్లు మరియు తగినంత తాగునీరు, అలాగే ప్రథమ చికిత్స పరికరాలను అందుబాటులో పెట్టాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ (MoHRE) మంత్రిత్వ శాఖలో తనిఖీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మొహ్సిన్ అల్ నస్సీ వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









