జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్
- June 01, 2024
యూఏఈ: యూఏఈలో జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్ అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వరుసగా 20వ సంవత్సరం కూడా వర్క్ బ్రేక్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. యూఏఈ అంతటా మధ్యాహ్నం 12.30 నుండి 3.00 గంటల మధ్య డైరెక్ట్ సూర్యకాంతిలో, బహిరంగ ప్రదేశాలలో పని చేయడం నిషేధం. మధ్యాహ్న విరామ సమయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి అధికారులు 5,000 దిర్హామ్ల జరిమానా విధిస్తారు. విరామ సమయంలో పలువురు ఉద్యోగులు పని చేస్తే 50,000 దిర్హామ్ల ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. అయితే, కొన్ని ఉద్యోగాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఉందని అధికారులు పేర్కొన్నారు. నీటి సరఫరా లేదా విద్యుత్తు, ట్రాఫిక్ను నిలిపివేయడం, రోడ్డు పనులపై తారు వేయడం లేదా కాంక్రీటు పోయడం మరియు ప్రాథమిక సేవలకు సంబంధించిన ఇతర పనులు మధ్యాహ్న విరామ సమయంలో కూడా పని కొనసాగించవచ్చని తెలిపారు. కాగా, విరామ సమయంలో పని కొనసాగించడానికి కంపెనీలు అనుమతి కోసం అప్లే చేసుకోవాలని సూచించారు. డైరెక్ట్ సూర్యకాంతిలో పనిచేసే ఉద్యోగులను రక్షించడానికి యజమానులు పారాసోల్లు, షేడెడ్ ఏరియాల వంటి వాటని సమకూర్చాలి. జాబ్ సైట్లలో ఫ్యాన్లు మరియు తగినంత తాగునీరు, అలాగే ప్రథమ చికిత్స పరికరాలను అందుబాటులో పెట్టాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ (MoHRE) మంత్రిత్వ శాఖలో తనిఖీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మొహ్సిన్ అల్ నస్సీ వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..