జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్
- June 01, 2024
యూఏఈ: యూఏఈలో జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్ అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వరుసగా 20వ సంవత్సరం కూడా వర్క్ బ్రేక్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. యూఏఈ అంతటా మధ్యాహ్నం 12.30 నుండి 3.00 గంటల మధ్య డైరెక్ట్ సూర్యకాంతిలో, బహిరంగ ప్రదేశాలలో పని చేయడం నిషేధం. మధ్యాహ్న విరామ సమయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి అధికారులు 5,000 దిర్హామ్ల జరిమానా విధిస్తారు. విరామ సమయంలో పలువురు ఉద్యోగులు పని చేస్తే 50,000 దిర్హామ్ల ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. అయితే, కొన్ని ఉద్యోగాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఉందని అధికారులు పేర్కొన్నారు. నీటి సరఫరా లేదా విద్యుత్తు, ట్రాఫిక్ను నిలిపివేయడం, రోడ్డు పనులపై తారు వేయడం లేదా కాంక్రీటు పోయడం మరియు ప్రాథమిక సేవలకు సంబంధించిన ఇతర పనులు మధ్యాహ్న విరామ సమయంలో కూడా పని కొనసాగించవచ్చని తెలిపారు. కాగా, విరామ సమయంలో పని కొనసాగించడానికి కంపెనీలు అనుమతి కోసం అప్లే చేసుకోవాలని సూచించారు. డైరెక్ట్ సూర్యకాంతిలో పనిచేసే ఉద్యోగులను రక్షించడానికి యజమానులు పారాసోల్లు, షేడెడ్ ఏరియాల వంటి వాటని సమకూర్చాలి. జాబ్ సైట్లలో ఫ్యాన్లు మరియు తగినంత తాగునీరు, అలాగే ప్రథమ చికిత్స పరికరాలను అందుబాటులో పెట్టాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ (MoHRE) మంత్రిత్వ శాఖలో తనిఖీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మొహ్సిన్ అల్ నస్సీ వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







