బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. దొరికి ఫ్లైట్ అటెండెంట్‌

- June 01, 2024 , by Maagulf
బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. దొరికి ఫ్లైట్ అటెండెంట్‌

మస్కట్: 960 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సిబ్బందిని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మంగళవారం నాడు మస్కట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్714 విమానంలో సురభి ఖాతున్ అనే  ఫ్లైట్ అటెండెంట్‌  కన్నూర్ వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. తనిఖీల అనంతరం ఆమె వద్ద నుంచి 960 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పురీషనాళంలో బంగారం పేస్ట్ రూపంలో దాచినట్లు అధికారులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com