సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ ప్రారంభం
- June 01, 2024
దోహా: 100 అవుట్లెట్లతో 60 కంపెనీల భాగస్వామ్యంతో, ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ (ఇండియన్ హంబా) నిన్న సౌక్ వాకీఫ్లో ప్రారంభమైంది. పది రోజుల పండుగ (జూన్ 8 వరకు) సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు మామిడి ఔత్సాహికులు మరియు సాంస్కృతిక అభిమానులను ఆకర్షించనుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి అల్ఫోన్సో, కేసర్, బంగనపల్లి, తోతాపురి, నీలం, మల్లిక, మల్గోవా, లంగడ మరియు మరెన్నో అనేక రకాల మామిడి పండ్లను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. ప్రారంభ వేడుకల్లో ఖతార్లోని భారత రాయబారి హెచ్ఈ విపుల్, ప్రైవేట్ ఇంజినీరింగ్ ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఈ నాసర్ రషీద్ అల్ నైమి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ హెచ్ఈ రాయబారి ఇబ్రహీం యూసిఫ్ అబ్దుల్లా ఫఖ్రూ, పలువురు రాయబారులు, అతిథులు పాల్గొన్నారు.
రాయబారి హెచ్ఈ విపుల్ మాట్లాడుతూ.. ఫెస్టివల్ కోసం భారతదేశం నుండి అనేక రకాల మామిడి పండ్లు మరియు మామిడి పండ్లతో తయారు చేయబడిన ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రతి ఖతారీకి భారతీయ మామిడిపండ్ల గురించి తెలుసునని, అయితే బిర్యానీ లాంటివి కూడా మమ్మల్ని కనెక్ట్ చేస్తాయి కానీ మామిడిపండ్లు వేసవికి చాలా ప్రత్యేకమైనవి. ”అని పేర్కొన్నారు. ఖతార్లోని భారతీయ కమ్యూనిటీ మరియు భారతీయ వ్యాపార సంస్థల సహకారంతో సౌక్ వాకిఫ్, భారత రాయబార కార్యాలయం ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









