సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ ప్రారంభం
- June 01, 2024
దోహా: 100 అవుట్లెట్లతో 60 కంపెనీల భాగస్వామ్యంతో, ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ (ఇండియన్ హంబా) నిన్న సౌక్ వాకీఫ్లో ప్రారంభమైంది. పది రోజుల పండుగ (జూన్ 8 వరకు) సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు మామిడి ఔత్సాహికులు మరియు సాంస్కృతిక అభిమానులను ఆకర్షించనుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి అల్ఫోన్సో, కేసర్, బంగనపల్లి, తోతాపురి, నీలం, మల్లిక, మల్గోవా, లంగడ మరియు మరెన్నో అనేక రకాల మామిడి పండ్లను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. ప్రారంభ వేడుకల్లో ఖతార్లోని భారత రాయబారి హెచ్ఈ విపుల్, ప్రైవేట్ ఇంజినీరింగ్ ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఈ నాసర్ రషీద్ అల్ నైమి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ హెచ్ఈ రాయబారి ఇబ్రహీం యూసిఫ్ అబ్దుల్లా ఫఖ్రూ, పలువురు రాయబారులు, అతిథులు పాల్గొన్నారు.
రాయబారి హెచ్ఈ విపుల్ మాట్లాడుతూ.. ఫెస్టివల్ కోసం భారతదేశం నుండి అనేక రకాల మామిడి పండ్లు మరియు మామిడి పండ్లతో తయారు చేయబడిన ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రతి ఖతారీకి భారతీయ మామిడిపండ్ల గురించి తెలుసునని, అయితే బిర్యానీ లాంటివి కూడా మమ్మల్ని కనెక్ట్ చేస్తాయి కానీ మామిడిపండ్లు వేసవికి చాలా ప్రత్యేకమైనవి. ”అని పేర్కొన్నారు. ఖతార్లోని భారతీయ కమ్యూనిటీ మరియు భారతీయ వ్యాపార సంస్థల సహకారంతో సౌక్ వాకిఫ్, భారత రాయబార కార్యాలయం ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







