భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
- June 04, 2024
ముంబై: 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల వేళ దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్ను గణనీయంగా దెబ్బతీసింది.మునుపటి అంచనాలకు విరుద్ధంగా బెంచ్ మార్క్ స్టాక్ మార్కెట్ సూచీలు, బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50, భారీగా పతనమయ్యాయి. ఈ అనూహ్య మలుపుతో మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది.నిన్నటి రెండు సూచీలు కొత్త ఆల్-టైమ్ గరిష్టాలకు ఎగబాకాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ నిర్ణయాత్మక విజయంపై ఎగ్జిట్ పోల్ అంచనాలు భారీగా నడిచాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రారంభ పోకడలు రెండు ప్రధాన కూటములు, ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య సన్నిహిత పోరును సూచిస్తున్నాయి. బెంచ్మార్క్ స్టాక్ మార్కెట్ సూచీలు 8శాతం పైగా పడిపోయాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు 2024లో రెండు ప్రధాన కూటములు, ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో నాలుగు ఏళ్ల అత్యంత దారుణమైన రోజుగా మారాయి.
రూ.26 లక్షల కోట్ల సంపద ఆవిరి :
పెట్టుబడిదారుల విశ్వాసంలో తిరోగమనానికి దారితీసింది. ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్న కొద్దీ స్టాక్ మార్కెట్ సూచీలు అంతకంతకూ కుప్పకూలుతున్నాయి. ఈరోజు ఉదయం ఆరంభంలో 2వేల పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్న సమయానికి 6వేల పాయింట్ల నష్టాల్లోకి దిగజారింది.
ఇక, నిఫ్టీ 50 సూచీ కూడా దాదాపు 1600 పాయింట్ల నుంచి 2వేల పాయింట్లకు పడిపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. నిన్నటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్నికల ఫలితాల వేళ కొద్దిగంటల్లోనే ఆవిరైపోయాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూసి భారీగా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు నిరాశే ఎదురైంది. బీఎస్ఈలోని మార్కెట్ విలువ, ఇన్వెస్టర్ల సంపద కాస్తా రూ.26 లక్షల కోట్లుగాపైగా ఆవిరైంది. ఎన్నికల ఫలితాలు ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపర్చాయి.
ఫలితాల ఎఫెక్ట్.. మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి :
అంచనాల ప్రకారం.. ఫలితాలు లేకపోవడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో 12.27 గంటలకు సెన్సెక్స్ 6061 పాయింట్లు కోల్పోగా, 70,382 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అయింది. ఎన్ఎసీఈ (NSE) నిఫ్టీ సూచీ కూడా 1789 పాయింట్లు కోల్పోయి 21,465 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం.. ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ మార్క్ దాటేసినప్పటికీ మదుపర్ల సెంటిమెంట్ను భారీగా దెబ్బతీసింది. అంచనాలకు మించి ఇండియా కూటమి కూడా ఒక్కసారిగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల అంచనాలు తప్పాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసినట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







