ఇటలీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..

- June 13, 2024 , by Maagulf
ఇటలీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..

న్యూ ఢిల్లీ: మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఈ సాయంత్రం ఇటలీ పర్యటనకు బయల్దేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు.

ఇటలీలోని ఏప్యూలియాలో జరిగే జీ7 అవుట్ రీచ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సు జూన్ 14 న జరగనుంది.ఈ సదస్సు సందర్భంగా, ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం, తదితర రంగాలకు చెందిన అంశాలపై మోదీ, మెలోనీ చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com