ఒమన్‌లో వలసదారుల పెరుగుదల గణనీయం

- June 11, 2016 , by Maagulf
ఒమన్‌లో వలసదారుల పెరుగుదల గణనీయం

ఒమన్‌లో వలసదారుల జనాభా గడచిన ఐదేళ్ళుగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సిఎస్‌ఐ) గణాంకాలు తెలిపాయి. మొత్తం జనాభాలో ప్రస్తుతం 45.5 శాతం వలసదారులున్నారు. 2011లో వలసదారులు 38.9 శాతం ఉన్నారు. 2010లో ఇది 29 శాతంగా ఉంది. వలసదారుల్లో ఎక్కువమంది భారతీయులు కాగా, రెండో స్థానంలో బంగ్లాదేశ్‌కి చెందినవారున్నారు. భారతీయ వలసదారుల సంఖ్య 687,592 మంది, బంగ్లాదేశీయులు 630,433 మంది ఉన్నారు. ఒమన్‌ జనాభా ప్రస్తుతం 4.4 మిలియన్లు. ఇందులో ఒమన్‌ జాతీయులు 50.5 శాతం ఉంటారు. ఒమన్‌లో మెజార్టీ నివాసితులు రాజధాని మస్కట్‌లో నివసిస్తున్నారు. ఆ తర్వాతి స్థానం నార్త్‌ బతినాది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com