ఒమన్లో వలసదారుల పెరుగుదల గణనీయం
- June 11, 2016
ఒమన్లో వలసదారుల జనాభా గడచిన ఐదేళ్ళుగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) గణాంకాలు తెలిపాయి. మొత్తం జనాభాలో ప్రస్తుతం 45.5 శాతం వలసదారులున్నారు. 2011లో వలసదారులు 38.9 శాతం ఉన్నారు. 2010లో ఇది 29 శాతంగా ఉంది. వలసదారుల్లో ఎక్కువమంది భారతీయులు కాగా, రెండో స్థానంలో బంగ్లాదేశ్కి చెందినవారున్నారు. భారతీయ వలసదారుల సంఖ్య 687,592 మంది, బంగ్లాదేశీయులు 630,433 మంది ఉన్నారు. ఒమన్ జనాభా ప్రస్తుతం 4.4 మిలియన్లు. ఇందులో ఒమన్ జాతీయులు 50.5 శాతం ఉంటారు. ఒమన్లో మెజార్టీ నివాసితులు రాజధాని మస్కట్లో నివసిస్తున్నారు. ఆ తర్వాతి స్థానం నార్త్ బతినాది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







