జులై 22వ తేదీన కేంద్ర బడ్జెట్!
- June 14, 2024
న్యూ ఢిల్లీ: మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇందులో తొలి రోజే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. తొలి రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అంతకంటే ముందు ప్రత్యేక సమావేశాల చివరి రోజైన జులై 3న ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఎదుట ఉంచనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు కొత్తగా ఏర్పడిన 18వ లోక్సభ సమావేశాలు జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరగనున్నాయి. తొలివిడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే కేవలం అయిదు పనిదినాలే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టి, దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం.. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







