టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..
- June 14, 2024
అమరావతి: ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా నియమితులు కావడంతో అచ్చెన్నాయుడు స్థానంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావును పార్టీ అధిష్ఠానం నేడు నియమించింది. దీనిపై పల్లా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, యువనేత నారా లోకేశ్ కు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు కృతజ్ఞతలు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించి, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను వెన్నుతట్టి నడిపిస్తున్న కార్యకర్తలకు, గాజువాక ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







