టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..
- June 14, 2024
అమరావతి: ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా నియమితులు కావడంతో అచ్చెన్నాయుడు స్థానంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావును పార్టీ అధిష్ఠానం నేడు నియమించింది. దీనిపై పల్లా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, యువనేత నారా లోకేశ్ కు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు కృతజ్ఞతలు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించి, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను వెన్నుతట్టి నడిపిస్తున్న కార్యకర్తలకు, గాజువాక ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









