విజయవాడ-ముంబై విమాన సర్వీస్ ప్రారంభం

- June 15, 2024 , by Maagulf
విజయవాడ-ముంబై విమాన సర్వీస్ ప్రారంభం

విజయవాడ: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో విజయవాడకు సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబై నగరానికి ఎయిర్‌ ఇండియా సంస్థ నూతన సర్వీసును నేటి(శనివారం) నుంచి ప్రారంభించనుంది. ఎంపీ బాలశౌరి ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో గతంలో పలుమార్లు విజయవాడ నుంచి ముంబై నగరానికి విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిని, అధికారులను కలిశారు.

ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శనివారం నాడు గన్నవరం నుంచి ముంబై నగరానికి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి ఎయిర్ ఇండియా వారి విమాన సేవలను ప్రారంభం కానుండగా.. ఈ విమాన సర్వీసును మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. దీంతో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు పట్టణ పరిసర ప్రాంత వ్యాపారులు, ఇతర అవసరాల నిమిత్తం విజయవాడ నుంచి ముంబైకి, ముంబై నుంచి విజయవాడ వచ్చేందుకు వీలుకలగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com