మహ్బౌలాలోని బేస్మెంట్ లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

- June 15, 2024 , by Maagulf
మహ్బౌలాలోని బేస్మెంట్ లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

కువైట్: కువైట్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. అయితే అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.  శుక్రవారం ఉదయం మహ్బౌలాలోని భవనం బేస్‌మెంట్ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు.

ఇదిలాఉండగా జూన్ 12న మంగాఫ్‌లోని కార్మిక వసతి గృహంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మరణించారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com