తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలీ..
- June 15, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని శాఖల్లో భారీగా బదిలీలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత మంది ఐఏఎస్ లతోపాటు పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆశీన్ సంగ్వన్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, నారాయణ పేట్ జిల్లాకు సక్తా పట్నాయక్, హనుమకొండ జిల్లాకు ప్రావిణ్య, జగిత్యాల జిల్లాకు సత్య ప్రసాద్, మహబూబ్నగర్ జిల్లాకు విజియేంద్ర, మంచిర్యాల జిల్లాకు దీపక్, వికారాబాద్ జిల్లాకు ప్రతీక్ జైన్, నల్లగొండ జిల్లాకు నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లాకు అదర్శ్ సురభి, వరంగల్ జిల్లాకు సత్య శారదా దేవి, ములుగు జిల్లాకు దివాకర్, నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్ను కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బదిలీ అయిన ఐఎఎస్ అధికారుల వివరాలు...
ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య బదిలీ. జగిత్యాల కలెక్టర్ గా సత్య ప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర బోయి, మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్ గా ప్రతిక్ జైన్, నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్, వరంగల్ కలెక్టర్ గా సత్య శారదా దేవి, ములుగు కలెక్టర్ గా టీఎస్ దివాకరా, నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ బదిలీ
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







