నివేదా ‘పరువు’ సమస్య.! అసలు కథ ఇదీ.!
- June 15, 2024
ఈ మధ్య కారు డిక్కీ ఓపెన్ చేయమన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతీ తెలిసిందే. పోలీసులు తమ పని తాము చేసుకుపోతామని ఎంత బతిమలాడినా.. ‘పరువు’ సమస్య ప్లీజ్ అర్ధం చేసుకోండి.! అంటూనే ఒకింత ఆటిట్యూడ్ చూపిస్తూ నివేదా పేతురాజ్ సోషల్ ఫాలోవర్స్కి స్పెషల్ స్టఫ్ ఇచ్చింది.
ఇంతకీ ఆ స్టఫ్ ఎందుకంటారా.! అఫ్కోర్స్ అప్పుడే చాలా మంది గ్రహించారనుకోండి.. అదంతా ఏదో సినిమా ప్రమోషన్ కోసమని. అయితే, అదో వెబ్ సిరీస్ ప్రమోషన్. ఆ సిరీస్ పేరే ‘పరువు’. లేటెస్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆధ్యంతం ఆసక్తిగా సాగే ఈ వెబ్ సిరీస్ని ప్రమోట్ చేసే క్రమంలోనే నివేదా పేతురాజ్ ఆ పబ్లిసిటీ స్టంట్ చేసింది. ఓ డెడ్ బాడీని కారు ఢిక్కీలో పెట్టి నివేదా తన భర్తతో కలిసి కారులో డ్రైవ్ చేస్తుండగా, పోలీసులకు చిక్కబోయే సన్నివేశం ఈ సిరీస్లో వుంటుంది.
ఎలాగూ సిరీస్ ఇంట్రెస్టింగ్గానే వుంది కాబట్టి, నివేదా కష్టపడి చేసిన ప్రమోషన్ కూడా బాగానే వర్కవుట్ అయినట్లే.!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







