విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి
- June 15, 2024
విజయవాడ: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చేతులమీదుగా విజయవాడ నుంచి ముంబై నగరానికి ఎయిర్ ఇండియా సంస్థ తీసుకొచ్చిన నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది.ఎంపీ బాలశౌరి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి,రిబ్బన్ కత్తిరించి నూతన సర్వీసుని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా మొదటి బోర్డింగ్ పాస్ ని ప్రయాణికులకు ఎంపీ బాలశౌరి అందజేశారు.ముంబైకి మన రాజధాని అమరావతి నుంచి విమాన సర్వీస్ తీసుకురావాలని కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చలు జరపగా నేటికి అవి ఫలించాయని తెలిపారు.ముంబై నగరానికి సర్వీస్ రావడం వల్ల విదేశాలకు వెళ్లే వారికి కనెక్టింగ్ ఫ్లైట్ గా ఉపయోగపడుతుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.

తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







