మళ్ళీ ప్రారంభం కానున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్!

- June 18, 2024 , by Maagulf
మళ్ళీ ప్రారంభం కానున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్!

న్యూ ఢిల్లీ: ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ ప్రజలతో మాట్లాడే కార్యక్రమం ‘మన్ కీ బాత్’. ప్రధానిగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30న ప్రసారం కాబోతోంది. రేడియో, టెలివిజన్ ద్వారా ప్రజలకు దగ్గర కావడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అప్పటినుండి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమవుతుంది. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రజలతో పంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతినెల 23 జాతీయ భాషలు, 31 మండలి కాళ్లు అన్ని కేంద్రాల ద్వారా ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. అలాగే ఇంగ్లీష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ఇది ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నాటినుంచి 2022 అక్టోబర్ వరకు మన్ కీ బాత్ ద్వారా ప్రసార భారతికి 33.16 కోట్ల ఆదాయం వచ్చింది. 2023 ఏప్రిల్ 30వ తేదీతో మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. సామాన్యులతో అనుసంధానానికి, ప్రజల్లోని భావ తీగలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందని చెప్పారు.

ఈ నెలవారీ రేడియో కార్యక్రమం ఈ 111వ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఎందుకంటే PM మోడీ మూడవసారి ప్రధాని అయిన తర్వాత ఇది మొదటి ఎపిసోడ్. ప్రవర్తనా నియమావళి కారణంగా, ప్రధాని మోదీ ఈ నెలవారీ కార్యక్రమం ప్రసారం కావడం లేదు. 11వ ఎపిసోడ్ ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో PM మూడవసారి NDAకి మెజారిటీని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలను పంచుకోవచ్చు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ నెలవారీ రేడియో కార్యక్రమం. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, సమస్యలపై ప్రధాని ఇక్కడ మాట్లాడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com