ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నిక
- June 18, 2024
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ (EC) మంగళవారం ప్రకటించింది. ఎమ్మెల్సీల రాజీనామాలతో ఐదింటిలో మూడు స్థానాలకు ఉప ఎన్నిక తప్పనిసరైందని ఇసి తెలిపింది. అనర్హత వేటు కారణంగా మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ధార్వాడా సెంట్రల్ స్థానం అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ నిరాకరించడంతో బిజెపిని వీడి కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికలకు ముందు తిరిగి బిజెపిలో చేరి ఎంపిగా గెలిచారు. యుపిలోని సమాజ్ వాది పార్టీ అభ్యర్థి మౌర్య ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
సిట్టింగ్ సభ్యులపై అనర్హత వేటు వేయడంతో ఎపి, బీహార్లలో ఒక్కోసీటు ఖాళీ అయింది. ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేయడంతో ఎపి శాసనమండలిలో మరోస్థానం ఖాళీ అయింది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







