ఖతార్లో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- June 19, 2024
దోహా: ఖతార్లో ఈ వారం చివరి వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఈ మేరకు ఖతార్ వాతావరణ శాఖ తన సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ వారం చివరి వరకు ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా 41 డిగ్రీల సెల్సియస్ నుండి 48 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో అధిక ఉష్ణోగ్రతల ఒత్తిడిని తట్టుకునేందుకు చిట్కాలతో అవగాహన కల్పిస్తోంది.
వాటిలో కొన్ని:
- ప్రతి 15 నిమిషాలకు చల్లని నీరు త్రాగాలి.
- టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ మరియు శీతల పానీయాలకు దూరంగా ఉండండి.
- పని సమయంలో మరింత తరచుగా పని విరామాలను షెడ్యూల్ చేయండి.
- తేలికైన, వదులుగా ఉండే దుస్తులు ధరించండి.
- ఆరుబయట ఉన్నప్పుడు మీ తలను కప్పి ఉంచండి.
అసాధారణమైన ప్రవర్తన, అస్పష్టమైన ప్రసంగం, మూర్ఛలు మరియు స్పృహ కోల్పోవడం వంటి వైద్య అత్యవసర పరిస్థితులు తలెత్తుతే వెంటనే 999కి కాల్ చేయాలి. అలాంటి వ్యక్తిని వెంటనే చల్లటి ప్రాంతానికి తరలించి, నీరు, మంచు లేదా ఫ్యాన్తో అతని శరీరాన్ని చల్లబరచాలని పేర్కొంది.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







