నలంద యూనివర్సిటీ..పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు..కానీ జ్ఞానం కాదు : మోదీ
- June 19, 2024
బిహార్ లోని రాజ్గిర్లో ఈరోజు(బుధవారం) ప్రధాని మోదీ నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ రాజేంద్ర వి. అర్లేకర్, సీఎం నీతిష్ కుమార్, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నలంద యూనివర్సిటీ.. భారత వారసత్వానికి, సంస్కృతికి చిహ్నమని అన్నారు. పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని ప్రశంసించారు. ఈ కొత్త విశ్వవిద్యాలయం దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. అగ్నికి పుస్తకాలు కాలిపోవచ్చు గాని.. జ్ఞానం కాదన్నారు.
ఇదిలా ఉండగా.. ఐదో శతాబ్దంలో ఏర్పాటుచేసిన పురాతన నలంద యూనివర్సిటీలో అప్పట్లో ఒకానొక టాప్ యూనివర్సిటీగా ఉండేది. ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునేవారు. నలంద విశ్వవిద్యాలయం దాదాపు 800 ఏళ్ల పాటు సేవలందించిందని నిపుణులు తెలిపారు. 12వ శతాబ్ధంలో భారత్లోకి చొరబడ్డ అఘ్గన్లు ఈ యూనివర్సిటీని కూల్చివేశారు. అందులో ఉన్న పుస్తకాలను, మాన్యుస్క్రిప్ట్లను తగులబెట్టేశారు. అయితే 2016లో ఐక్యరాజ్యసమితి ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ప్రకటించింది.
A memorable mix of history and education. Nalanda is truly special. Here are today’s highlights. pic.twitter.com/J17pxCwUD1
— Narendra Modi (@narendramodi) June 19, 2024
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







