వైఎస్ జగన్ కు భారీ షాక్..
- June 22, 2024
అమరావతి: వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ కు భారీ షాక్ ఇచ్చింది కూటమి సర్కార్. తాడేపల్లిలో నిర్మాణంలో అక్రమంగా కడుతున్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసింది. శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభించారు. పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. శ్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును కోర్టును ఆశ్రయించింది వైసీపీ.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయ నిర్మాణం మొదలైంది. కానీ ఇక్కడ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని గతంలో సీఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో.. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారడంతో అధికారులు దాన్ని కూల్చివేశారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









