హైదరాబాద్-విజయవాడ హైవే పై ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి
- June 22, 2024
హైదరాబాద్: హైదరాబాద్- విజయవాడ హైవేపై నిత్యం ట్రాఫిక్ కష్టాలు ప్రయాణికులను , వాహనదారులను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులకు చెక్ పడబోతున్నట్లు తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతుంది. తహశీల్దారు ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు 2 కి.మీ. పొడవున నిర్మించనున్నారు.
ఈ ఫ్లైఓవర్కు మొత్తం రూ.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. వంతెన నిర్మించే ప్రదేశం గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్ధారణ కావడంతో పనులు మరింత వేగంగా జరిగేందుకు చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ను దక్కించుకున్న హర్యానాకు చెందిన రాంకుమార్ కన్స్ట్రక్షన్స్..నిర్మాణ పనులను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







