హైదరాబాద్-విజయవాడ హైవే పై ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి
- June 22, 2024
హైదరాబాద్: హైదరాబాద్- విజయవాడ హైవేపై నిత్యం ట్రాఫిక్ కష్టాలు ప్రయాణికులను , వాహనదారులను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులకు చెక్ పడబోతున్నట్లు తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతుంది. తహశీల్దారు ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు 2 కి.మీ. పొడవున నిర్మించనున్నారు.
ఈ ఫ్లైఓవర్కు మొత్తం రూ.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. వంతెన నిర్మించే ప్రదేశం గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్ధారణ కావడంతో పనులు మరింత వేగంగా జరిగేందుకు చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ను దక్కించుకున్న హర్యానాకు చెందిన రాంకుమార్ కన్స్ట్రక్షన్స్..నిర్మాణ పనులను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







