హైదరాబాద్-విజయవాడ హైవే పై ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి
- June 22, 2024
హైదరాబాద్: హైదరాబాద్- విజయవాడ హైవేపై నిత్యం ట్రాఫిక్ కష్టాలు ప్రయాణికులను , వాహనదారులను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులకు చెక్ పడబోతున్నట్లు తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతుంది. తహశీల్దారు ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు 2 కి.మీ. పొడవున నిర్మించనున్నారు.
ఈ ఫ్లైఓవర్కు మొత్తం రూ.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. వంతెన నిర్మించే ప్రదేశం గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్ధారణ కావడంతో పనులు మరింత వేగంగా జరిగేందుకు చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ను దక్కించుకున్న హర్యానాకు చెందిన రాంకుమార్ కన్స్ట్రక్షన్స్..నిర్మాణ పనులను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









