కువైట్ కు గాయపడ్డ కార్మికుల బంధువులు..!
- June 22, 2024
కువైట్: మంగాఫ్ వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఉద్యోగుల బంధువులు ఆదివారం కువైట్ చేరుకోనున్నట్లు NBTC యాజమాన్యం ప్రకటించింది. హెచ్ఆర్ & అడ్మిన్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ మనోజ్ నంధియాలత్ మాట్లాడుతూ.. తమ వారిని చూడాలనుకున్న గాయపడిన ఉద్యోగుల బంధువులు కువైట్కు వస్తారని తెలియజేసారు. వారి వీసాలు, రౌండ్-ట్రిప్ విమాన టిక్కెట్లు, ఫుడ్, వసతి మరియు రవాణా కోసం ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే 61 మందిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. వారిలో 53 మంది ఉద్యోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న 3 మందితో సహా 8 మంది ఆసుపత్రిలో ఉన్నారు. వారి స్వదేశంలో ప్రత్యేక చికిత్స అవసరమైన వారికి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు గుర్తించని భారతీయ ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించేందుకు అనుమానితుడి సోదరుడిని ఆదివారం కువైట్కు తీసుకురావడానికి NBTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన రాగానే కువైట్ అధికారులు మృతుడిని అధికారికంగా గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









