కువైట్ కు గాయపడ్డ కార్మికుల బంధువులు..!
- June 22, 2024
కువైట్: మంగాఫ్ వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఉద్యోగుల బంధువులు ఆదివారం కువైట్ చేరుకోనున్నట్లు NBTC యాజమాన్యం ప్రకటించింది. హెచ్ఆర్ & అడ్మిన్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ మనోజ్ నంధియాలత్ మాట్లాడుతూ.. తమ వారిని చూడాలనుకున్న గాయపడిన ఉద్యోగుల బంధువులు కువైట్కు వస్తారని తెలియజేసారు. వారి వీసాలు, రౌండ్-ట్రిప్ విమాన టిక్కెట్లు, ఫుడ్, వసతి మరియు రవాణా కోసం ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే 61 మందిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. వారిలో 53 మంది ఉద్యోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న 3 మందితో సహా 8 మంది ఆసుపత్రిలో ఉన్నారు. వారి స్వదేశంలో ప్రత్యేక చికిత్స అవసరమైన వారికి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు గుర్తించని భారతీయ ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించేందుకు అనుమానితుడి సోదరుడిని ఆదివారం కువైట్కు తీసుకురావడానికి NBTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన రాగానే కువైట్ అధికారులు మృతుడిని అధికారికంగా గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









