కువైట్ కు గాయపడ్డ కార్మికుల బంధువులు..!
- June 22, 2024
కువైట్: మంగాఫ్ వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఉద్యోగుల బంధువులు ఆదివారం కువైట్ చేరుకోనున్నట్లు NBTC యాజమాన్యం ప్రకటించింది. హెచ్ఆర్ & అడ్మిన్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ మనోజ్ నంధియాలత్ మాట్లాడుతూ.. తమ వారిని చూడాలనుకున్న గాయపడిన ఉద్యోగుల బంధువులు కువైట్కు వస్తారని తెలియజేసారు. వారి వీసాలు, రౌండ్-ట్రిప్ విమాన టిక్కెట్లు, ఫుడ్, వసతి మరియు రవాణా కోసం ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే 61 మందిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. వారిలో 53 మంది ఉద్యోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న 3 మందితో సహా 8 మంది ఆసుపత్రిలో ఉన్నారు. వారి స్వదేశంలో ప్రత్యేక చికిత్స అవసరమైన వారికి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు గుర్తించని భారతీయ ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించేందుకు అనుమానితుడి సోదరుడిని ఆదివారం కువైట్కు తీసుకురావడానికి NBTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన రాగానే కువైట్ అధికారులు మృతుడిని అధికారికంగా గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







