కువైట్ కు గాయపడ్డ కార్మికుల బంధువులు..!
- June 22, 2024
కువైట్: మంగాఫ్ వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఉద్యోగుల బంధువులు ఆదివారం కువైట్ చేరుకోనున్నట్లు NBTC యాజమాన్యం ప్రకటించింది. హెచ్ఆర్ & అడ్మిన్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ మనోజ్ నంధియాలత్ మాట్లాడుతూ.. తమ వారిని చూడాలనుకున్న గాయపడిన ఉద్యోగుల బంధువులు కువైట్కు వస్తారని తెలియజేసారు. వారి వీసాలు, రౌండ్-ట్రిప్ విమాన టిక్కెట్లు, ఫుడ్, వసతి మరియు రవాణా కోసం ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే 61 మందిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. వారిలో 53 మంది ఉద్యోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న 3 మందితో సహా 8 మంది ఆసుపత్రిలో ఉన్నారు. వారి స్వదేశంలో ప్రత్యేక చికిత్స అవసరమైన వారికి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు గుర్తించని భారతీయ ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించేందుకు అనుమానితుడి సోదరుడిని ఆదివారం కువైట్కు తీసుకురావడానికి NBTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన రాగానే కువైట్ అధికారులు మృతుడిని అధికారికంగా గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







