నేరేడు పండ్లు ఎక్కువగా తింటున్నారా.?
- June 22, 2024
సీజనల్గా వచ్చే పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. అయితే, కొన్ని రకాల పండ్లను సీజన్లో అయినా సరే మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
లేదంటే అవి అనేక రకాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయట. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి నేరేడు పండ్లు. ఈ పండ్లు కేవలం సీజన్లో మాత్రమే లభిస్తాయ్. ఆయా సీజన్లలో వీటిని ఖచ్చితంగా ఒక్కసారైనా తినాలని చెబుతారు.
అయితే, అతిగా నేరేడు పండ్లు తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండ్లు అతిగా తీసుకోవడం వల్ల గ్యాస్ర్టిక్ సమస్యలు అధికమవుతాయట. అలాగే, గొంతు సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు.
అంతేకాదు, మొటిమలు రావడం, ఇతరత్రా చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలు ఎక్కువ కావడం వంటి సమస్యలొస్తాయని తాజా సర్వేలో తేలింది.
మలబద్ధకం సమస్య వున్నవాళ్లు ఈ పండ్లను తినకపోవడమే మంచిదని అంటున్నారు. అతి సర్వత్రా వర్జ్యయేత్ అంటారుగా.! అది నేరేడు పండ్ల విషయంలో ఇంకాస్త ఎక్కువే వున్నట్లుంది. సో, తస్మాత్ జాగ్రత్త.!
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









