శ్రీవారి దర్శనం,లడ్డూ ధరల్లో మార్పు లేదు: TTD
- June 22, 2024
తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పష్టం చేసింది. టీటీడీ దర్శనం, లడ్డు ధరలను సవరించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని టీటీడీ కొట్టిపారేసింది. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ధర రూ.300 ఉండగా, లడ్డూ ప్రసాదం రూ. 50 ధరల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. అంతేకాదు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
టూరిజం వెబ్సైట్ ద్వారా భక్తులకు టిక్కెట్లు బుక్ చేయిస్తామని చెప్పి అందుకు ధర ఎక్కువ అవుతుందని, శ్రీవారి దర్శనం కోసం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో శ్రీవారి దర్శనానికి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందిస్తామంటూ కొన్ని ఫోన్ నంబర్లతో సమాచారం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం శాఖలకు కొన్ని టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు సంబంధిత టూరిజం ద్వారా ఆయా దర్శన టిక్కెట్లను పొందే సౌకర్యం ఉంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దళారుల మాటలు నమ్మి భక్తులు మోసపోవద్దు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









