అధునాతన సౌకర్యాలతో కొత్త రక్తదాన కేంద్రం
- June 23, 2024
దోహా: కొత్తగా స్థాపించబడిన ఖతార్ నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్ (QNBDC) వందలాది మంది దాతలకు ఒకేసారి సేవలు అందిస్తుంది. ఇందులో అధునాతన సౌకర్యాల ద్వారా రక్త సేకరణను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రం పెద్ద ఎత్తున రక్తదానం ప్రచారాలను సులభతరం చేయడమే కాకుండా, దాతల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. "300 మంది దాతలకు ఒకేసారి వసతి కల్పించే సామర్థ్యం, 38 మంది దాతల నుండి ఒకేసారి రక్తాన్ని సేకరించే సామర్థ్యం కారణంగా QNBDC చాలా ప్రయోజనకరంగా ఉంది. దీనికి అదనంగా 12 పడకలతో ప్రత్యేక అఫెరిసిస్ సేకరణ గదిని ఏర్పాటు చేశారు." అని హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) లాబొరేటరీ మెడిసిన్ మరియు పాథాలజీ విభాగం (DLMP) డాక్టర్ ఈనాస్ అల్ కువారి చెప్పారు. "ప్రతి రక్తదానం మా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అనేక మంది రోగులకు కీలకమైన జీవనాధారంగా పనిచేస్తుంది. రక్తదానం ద్వారా సేకరించిన బ్లడ్ కనీసం ముగ్గురు రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ”అని డాక్టర్ అల్ కువారి చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









