జూన్ 24 నుండి ఎన్‌సిఎస్‌ఐ సర్వే

- June 24, 2024 , by Maagulf
జూన్ 24 నుండి ఎన్‌సిఎస్‌ఐ సర్వే

మస్కట్: ప్రభుత్వ సేవలపై లబ్ధిదారుల పనితీరుపై 3వ ఎడిషన్ అభిప్రాయ సేకరణను నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జూన్ 24 నుండి నిర్వహించనుంది. సర్వే 30 నవంబర్ వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ సంస్థలు అందించే సేవలతో వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకోవడం, అభ్యర్థించిన సేవలను పూర్తి చేయడం వంటి అంశాలతో సహా ఎలక్ట్రానిక్ సేవల లబ్ధిదారుల అభిప్రాయాన్ని వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం ఈ సర్వే లక్ష్యం అని పేర్కొన్నారు.  ప్రభుత్వ సేవలను మూల్యాంకనం చేయడానికి ప్రాథమిక ప్రమాణాలకు అనుగుణంగా 2023 చివరి త్రైమాసికం, 2024 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ సంస్థల వినియోగదారుల నమూనాను లక్ష్యంగా చేసుకుని అభిప్రాయ సేకరణ సర్వే ఫోన్‌లో నిర్వహించబడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com