అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు..
- June 12, 2016
అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఔత్సాహికులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఇండియా పర్మనెంట్ మిషన్ ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్, 2014 మిస్ అమెరికా నినా దవులూరి, ఐక్యరాజ్యసమితి ప్రముఖులు టైమ్ స్క్వేర్ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సద్గురు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక సందేశాన్ని ప్రజలకు అందించనున్నారు.అక్కడ ఉన్న స్థానిక భారతీయుల కోసం భారత దౌత్యకార్యాలయం వారం పాటు పలు కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా యోగాపై అవగాహన కల్పించనుంది. పాఠశాలలు, ఆలయాలు, జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయం, నేవార్క్ విమానాశ్రయంలోను యోగా కార్యక్రమాలను నిర్వహించనుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







