యూఏఈ, భారత విదేశాంగ మంత్రుల భేటీ..వ్యూహాత్మక సంబంధాలపై చర్చలు
- June 25, 2024
యూఏఈ: విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత విదేశాంగ మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ను అభినందించారు. అబుదాబిలో వీరిద్దరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడం గురించి చర్చించారు. సమగ్ర వ్యూహాత్మక మరియు ఆర్థిక భాగస్వామ్యం ద్వైపాక్షిక సహకారం వివిధ రంగాలలో సాధించిన పురోగతిని వారు సమీక్షించారు. ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సంస్కృతి, ఆరోగ్యం, ఆహార భద్రత, పునరుత్పాదక ఇంధనం మరియు వాతావరణ మార్పులతో సహా అన్ని రంగాలలో ఉమ్మడి సహకారాన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాల ప్రయత్నాలను షేక్ అబ్దుల్లా కొనియాడారు.
"మే 2022లో ప్రారంభించబడిన యూఏఈ-భారత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ), రెండు దేశాల జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇచ్చే విధంగా ఆర్థిక మరియు వాణిజ్య సహకారాన్ని గణనీయంగా పెంచింది." అని ఆయన తెలిపారు. మధ్యప్రాచ్యంలోని పరిస్థితితో సహా ప్రస్తుత ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను కూడా ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







