యూఏఈలో 50°C దాటిన ఉష్ణోగ్రతలు
- June 27, 2024
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు 50°C మార్కును అధిగమించాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రకారం, మంగళవారం దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉమ్ అజిముల్ (అల్ ఐన్)లో మధ్యాహ్నం 2 గంటలకు 50.3 ° C నమోదైంది. ప్రముఖ ఎమిరాటీ ఫోటోగ్రాఫర్ రషీద్ అజీజ్ కూడా సోమవారం నాడు అబుదాబిలోని అల్ షవామెఖ్లోని నేషనల్ మెటియోరోలాజికల్ సెంటర్ ప్యానెల్లో 50.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను రికార్డ్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన వేసవి కాలం సాధారణంగా జూలై మధ్య నుండి మొదలై ఆగస్టు చివరి వరకు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలతోపాటు, తేమ స్థాయిలు 90 శాతానికి పెరగవచ్చు లేదా ఎడారి నుండి ఉద్భవించే దుమ్ము తుఫానులు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, హీట్ స్ట్రోక్ మరియు హీట్ ఎగ్జాషన్ కేసులు పెరుగుతున్నందున వైద్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులను కోరారు. నివాసితులు హైడ్రేటెడ్గా ఉండాలని, ప్రత్యక్ష సూర్యకాంతి కిందకు వెళ్లకుండా ఉండాలని మరియు మధ్యాహ్న సమయంలో బయట వెళ్లవద్దని సూచించారు.
గత సంవత్సరం ఆగస్టులో మెట్ డిపార్ట్మెంట్ యూఏఈలో సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే రోజును నమోదు చేసింది. అబుదాబిలోని ఓవటైడ్ (అల్ దఫ్రా ప్రాంతం)లో మధ్యాహ్నం 2.45 గంటలకు 50.8°C ఉష్ణోగ్రత నమోదైంది. హజ్ 2024 సమయంలో తీవ్రమైన వేడి కారణంగా మరణించిన వారి సంఖ్య 1,000 దాటింది. జూన్ 17న ఉష్ణోగ్రతలు 51.8°C వరకు పెరిగాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







