79 మంది ఏజెంట్లు, పంపిణీదారులపై జరిమానా
- June 27, 2024
రియాద్: 2023 సంవత్సరంలో కాంపిటీషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఏజెంట్లు మరియు పంపిణీదారులతో సహా ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తున్న 79 సంస్థలపై అభియోగాలను సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ నమోదు చేసింది. వీటిలో 64 సంస్థలపై అథారిటీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం మిగిలిన 15 సంస్థలపై ఉన్న కేసుల పరిష్కారం కోసం సమర్పించిన అభ్యర్థనలను పరిశీలిస్తోంది. వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వీటిలో మూడు ఫార్మసీలు, నాలుగు రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. పౌల్ట్రీ మరియు గుడ్ల ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న మూడు సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి తక్కువ ధరలను నిర్ణయంచడంపై కేసులు నమోదయ్యయి. SR600 మిలియన్ల బిడ్లలో ప్రధాన కంపెనీలతో కుమ్మక్కైనందుకు ఆరు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సెటిల్మెంట్ లకు సంబంధించిన పక్రియను నిర్వహించడంలో విఫలమైనందుకు రెండు హోల్సేల్ సంస్థలపై క్రిమినల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్టు అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









