79 మంది ఏజెంట్లు, పంపిణీదారులపై జరిమానా
- June 27, 2024
రియాద్: 2023 సంవత్సరంలో కాంపిటీషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఏజెంట్లు మరియు పంపిణీదారులతో సహా ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తున్న 79 సంస్థలపై అభియోగాలను సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ నమోదు చేసింది. వీటిలో 64 సంస్థలపై అథారిటీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం మిగిలిన 15 సంస్థలపై ఉన్న కేసుల పరిష్కారం కోసం సమర్పించిన అభ్యర్థనలను పరిశీలిస్తోంది. వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వీటిలో మూడు ఫార్మసీలు, నాలుగు రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. పౌల్ట్రీ మరియు గుడ్ల ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న మూడు సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి తక్కువ ధరలను నిర్ణయంచడంపై కేసులు నమోదయ్యయి. SR600 మిలియన్ల బిడ్లలో ప్రధాన కంపెనీలతో కుమ్మక్కైనందుకు ఆరు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సెటిల్మెంట్ లకు సంబంధించిన పక్రియను నిర్వహించడంలో విఫలమైనందుకు రెండు హోల్సేల్ సంస్థలపై క్రిమినల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్టు అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









