15 మంది ఫిలిప్పియన్లకు రమదాన్ సందర్భంగా క్షమాపణ

- June 13, 2016 , by Maagulf
15 మంది ఫిలిప్పియన్లకు రమదాన్ సందర్భంగా క్షమాపణ

 

మనీలా : రంజాన్ ప్రారంభంలో 15 మంది ఫిలిపినో కార్మికులు జైలు పాలయ్యారు. కతర్ జైలులో ఉన్న  వీరి విడుదలకు  కతర్ ఎమిర్ చేసిన కృషి కి  ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బెనిగ్నో అక్వినో కృతజ్ఞతలు తెలిపారు .
 షేక్ [హమద్] బిన్ ఖలీఫా అల్ థానీ, వారిని క్షమిస్తున్నట్లు పేర్కోవడం పట్ల  మేము కతర్ ఎమిర్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అక్వినో యొక్క ప్రతినిధి కమ్యూనికేషన్స్ కార్యదర్శి హీర్మినియో   కలోమ జూనియర్ తెలిపారు.ఇది  ఫిలిప్పీన్స్ మరియు కతర్ మధ్య మంచి సంబంధం కొనసాగింపుగా అభివృద్ధి అని ఆయన చెప్పారు.
ఫిలిపినో కార్మికులని క్షమించదాంతో వారిని స్వదేశానికి పంపడానికి  సన్నాహాలు చురుగ్గా  కొనసాగుతున్నాయని  మనీలా విదేశాంగ వ్యవహారాల శాఖ పేర్కొంది.  ఖైదీలను పేర్లు విడుదల చేయలేదు. 172,000 విదేశీ ఫిలిపినో కార్మికులు (OFWs) ఖతార్ ఆతిథ్యం ఇస్తుంది. వీరిలో 23,000 మంది  నిపుణులుగా  ఉన్నారు. అలాగే  86,000 మంది  అత్యంత నైపుణ్యం గలవారు ; 30,000 సెమీ లేదా తక్కువ నైపుణ్యం గల  కార్మికులు కాగా 30000 మంది  గృహ సేవ కార్మికులుగా ఉన్నారని  కార్మిక శాఖ పేర్కొంది.
 2014 లో  85.510 నుండి  2015 లో  104.872 మంది కతర్ లో ఉన్నారని  , 19.362 మందితో యొక్క పెరుగుదల జరిగిందని  ఫిలిప్పీన్ విదేశీ ఉపాధి అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.10 మిలియన్ కంటే ఎక్కువ విదేశీ ఫిలిపినో కార్మికులు (OFWs) మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆధారపడి ఉన్నారని,  100 మిలియన్ల దేశ జనాభాలో 10 శాతం ఈ సంఖ్య పెరిగిందని అన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com