తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం..
- July 03, 2024
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్ష నియామకం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం కారణంగా కేబినెట్ విస్తరణ, పీసీనీ నియామకం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వారం పది రోజుల తర్వాత మరోసారి దీనిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణ పీసీసీ నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని అభిప్రాయానికి వచ్చిన ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి కొంత సమయం పడుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండింటిపై నిర్ణయం తీసుకోవడం కన్నా కొంత సమయం వరకు వేచి ఉండి ఆ తరువాతే చర్చిస్తే మంచిదని కాంగ్రెస్ అగ్రనేతలు కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కర్ణాటక వెళ్లిపోగా, కేసీ వేణుగోపాల్ కేరళ వెళ్లిపోయినట్టు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు నియామకంతోపాటు కేబినెట్ విస్తరణపై కసరత్తు కొలిక్కిరాలేదని సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో జరిగిన కీలక భేటీలోనూ ఏకాభిప్రాయం రాలేదని నేతలు అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే నేతల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం అడిగి తెలిసుకున్నట్టు తెలుస్తోంది. మరోమారు పార్టీ నేతలతో చర్చల ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









