వావ్ నానీ.! వాట్ ఏ క్రేజీ కాంబినేషన్.!
- July 04, 2024
టాలీవుడ్లో దర్శకుల యందు శేఖర్ కమ్ముల దర్శకత్వం వేరయా అంటే అతిశయోక్తి కాదేమో. చేసినవి తక్కువ సినిమాలే అయినా సెలెక్టివ్ కథలను ఎంచుకుంటుంటాడు శేఖర్ కమ్ముల. వాటిని తెరకెక్కించే విధానం కూడా చాలా అద్భుతంగా అందంగా వుంటుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారట.
ఈ కాంబినేషన్ తెలియగానే వావ్ వాట్ ఏ క్రేజీ కాంబినేషన్ అంటున్నారు సినీ మేధావులు. శేఖర్ కమ్ముల డైరెక్టన్లో నాని నటించడం ఇదే తొలిసారి. కానీ, ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సూపర్బ్గా వుంటుందని అప్పుడే అంచనాలేసేస్తున్నారు అభిమానులు.
ఏషియన్ సునీల్ ఈ సినిమాని నిర్మించనున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావల్సి వుంది. ఈ లోపే శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ చిత్రం, నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలు పూర్తి కానున్నాయ్.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









