వావ్ నానీ.! వాట్ ఏ క్రేజీ కాంబినేషన్.!
- July 04, 2024
టాలీవుడ్లో దర్శకుల యందు శేఖర్ కమ్ముల దర్శకత్వం వేరయా అంటే అతిశయోక్తి కాదేమో. చేసినవి తక్కువ సినిమాలే అయినా సెలెక్టివ్ కథలను ఎంచుకుంటుంటాడు శేఖర్ కమ్ముల. వాటిని తెరకెక్కించే విధానం కూడా చాలా అద్భుతంగా అందంగా వుంటుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారట.
ఈ కాంబినేషన్ తెలియగానే వావ్ వాట్ ఏ క్రేజీ కాంబినేషన్ అంటున్నారు సినీ మేధావులు. శేఖర్ కమ్ముల డైరెక్టన్లో నాని నటించడం ఇదే తొలిసారి. కానీ, ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సూపర్బ్గా వుంటుందని అప్పుడే అంచనాలేసేస్తున్నారు అభిమానులు.
ఏషియన్ సునీల్ ఈ సినిమాని నిర్మించనున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావల్సి వుంది. ఈ లోపే శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ చిత్రం, నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలు పూర్తి కానున్నాయ్.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







