వావ్ నానీ.! వాట్ ఏ క్రేజీ కాంబినేషన్.!
- July 04, 2024
టాలీవుడ్లో దర్శకుల యందు శేఖర్ కమ్ముల దర్శకత్వం వేరయా అంటే అతిశయోక్తి కాదేమో. చేసినవి తక్కువ సినిమాలే అయినా సెలెక్టివ్ కథలను ఎంచుకుంటుంటాడు శేఖర్ కమ్ముల. వాటిని తెరకెక్కించే విధానం కూడా చాలా అద్భుతంగా అందంగా వుంటుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారట.
ఈ కాంబినేషన్ తెలియగానే వావ్ వాట్ ఏ క్రేజీ కాంబినేషన్ అంటున్నారు సినీ మేధావులు. శేఖర్ కమ్ముల డైరెక్టన్లో నాని నటించడం ఇదే తొలిసారి. కానీ, ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సూపర్బ్గా వుంటుందని అప్పుడే అంచనాలేసేస్తున్నారు అభిమానులు.
ఏషియన్ సునీల్ ఈ సినిమాని నిర్మించనున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావల్సి వుంది. ఈ లోపే శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ చిత్రం, నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలు పూర్తి కానున్నాయ్.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







