తారక్-ప్రశాంత్ నీల్ అప్పుడే మొదలెట్టేస్తారా.?
- July 04, 2024
గ్లోబల్ స్టార్ ఎన్టీయార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సిన సంగతి తెలిసిందే. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడనుకున్నారు.
కానీ, అప్పటికే ఎన్టీయార్ కమిట్ అయిన ‘దేవర’ సినిమా వుండడంతో ఆ సినిమాని పూర్తి చేసే పనిలో వున్నాడు ఎన్టీయార్. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది.
అలాగే ఎన్టీయార్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ కూడా ఓ కొలిక్కి వచ్చేసింది. దాంతో, ఇక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందనీ సమాచారం. అన్నీ కలిసొస్తే ఈ సినిమాని సెప్టెంబర్లో స్టార్ట్ చేసేందుకు ఎన్టీయార్ అండ్ ప్రశాంత్ నీల్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట.
ఇక, ‘దేవర’ విషయానికి వస్తే, ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయ్.
అలాగే, త్వరలో సెకండ్ సింగిల్ కూడా వదిలేందుకు కొరటాల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







