ఘానాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
- June 13, 2016
ఆఫ్రికా దేశమైన ఘానా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఉగ్రవాదంపై స్పందించారు. దానికి ఎలాంటి సరిహద్దులూ లేవని దేశాలన్నీ సమష్టిగా దాన్ని రూపుమాపడానికి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు ఘానాలో పర్యటించనున్న ప్రణబ్.. ఆ దేశాధ్యక్షుడు జాన్ ద్రామని మహమా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 'ఆఫ్రికా' పేరుతో రాసిన గీతాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. .ఉగ్రవాదం మానవాళికి శాపంగా మారిందన్నారు.దీనికి సరిహద్దులు లేవని వినాశనకర సిద్ధాంతాలు విస్తరించకూడదని ఆకాంక్షించారు. ప్రపంచమంతా ఏకమై దీన్ని సవాలుగా తీసుకుని.. నామరూపాలు లేకుండా చెయ్యాలన్నారు. ప్రస్తుత సమయంలో ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయన్నారు. సరైన అవకాశాలు ఇస్తే భారత వ్యాపారవేత్తలు ఘానాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఘానాకు ఉన్న శక్తి వారందరికీ బాగా తెలుసునని చెప్పారు.
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









