ఘానాలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

- June 13, 2016 , by Maagulf
ఘానాలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

ఆఫ్రికా దేశమైన ఘానా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉగ్రవాదంపై స్పందించారు. దానికి ఎలాంటి సరిహద్దులూ లేవని దేశాలన్నీ సమష్టిగా దాన్ని రూపుమాపడానికి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు ఘానాలో పర్యటించనున్న ప్రణబ్‌.. ఆ దేశాధ్యక్షుడు జాన్‌ ద్రామని మహమా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 'ఆఫ్రికా' పేరుతో రాసిన గీతాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. .ఉగ్రవాదం మానవాళికి శాపంగా మారిందన్నారు.దీనికి సరిహద్దులు లేవని వినాశనకర సిద్ధాంతాలు విస్తరించకూడదని ఆకాంక్షించారు. ప్రపంచమంతా ఏకమై దీన్ని సవాలుగా తీసుకుని.. నామరూపాలు లేకుండా చెయ్యాలన్నారు. ప్రస్తుత సమయంలో ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయన్నారు. సరైన అవకాశాలు ఇస్తే భారత వ్యాపారవేత్తలు ఘానాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఘానాకు ఉన్న శక్తి వారందరికీ బాగా తెలుసునని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com