ఘానాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
- June 13, 2016
ఆఫ్రికా దేశమైన ఘానా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఉగ్రవాదంపై స్పందించారు. దానికి ఎలాంటి సరిహద్దులూ లేవని దేశాలన్నీ సమష్టిగా దాన్ని రూపుమాపడానికి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు ఘానాలో పర్యటించనున్న ప్రణబ్.. ఆ దేశాధ్యక్షుడు జాన్ ద్రామని మహమా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 'ఆఫ్రికా' పేరుతో రాసిన గీతాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. .ఉగ్రవాదం మానవాళికి శాపంగా మారిందన్నారు.దీనికి సరిహద్దులు లేవని వినాశనకర సిద్ధాంతాలు విస్తరించకూడదని ఆకాంక్షించారు. ప్రపంచమంతా ఏకమై దీన్ని సవాలుగా తీసుకుని.. నామరూపాలు లేకుండా చెయ్యాలన్నారు. ప్రస్తుత సమయంలో ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయన్నారు. సరైన అవకాశాలు ఇస్తే భారత వ్యాపారవేత్తలు ఘానాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఘానాకు ఉన్న శక్తి వారందరికీ బాగా తెలుసునని చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







