రాగి, ఎలక్ట్రికల్ కేబుల్ చోరీ.. విదేశీ ముఠాకు పదేళ్ల జైలు శిక్ష

- July 08, 2024 , by Maagulf
రాగి, ఎలక్ట్రికల్ కేబుల్ చోరీ.. విదేశీ ముఠాకు పదేళ్ల జైలు శిక్ష

రియాద్:  రాగి, ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది విదేశీయులతో కూడిన ముఠాపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను పూర్తి చేసింది. నిందితుల ముఠా సభ్యులు ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీకి పాల్పడ్డారు.వాటిని విక్రయించాలనే ఉద్దేశ్యంతో వారు అద్దె ప్రదేశంలో దాచిపెట్టారు. నిందితులను అరెస్టు చేసి తగిన కోర్టుకు తరలించారు. కోర్టు వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది. వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించారు. వారి చర్యల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయాలని ఆదేశించింది. వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారు రాజ్యం నుండి బహిష్కరించాలని తీర్పులో ఆదేశించారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com