దుబాయ్లో పునఃప్రారంభమైన మెట్రో సేవలు
- July 09, 2024
దుబాయ్: సోమవారం సాయంత్రం ఈక్విటీ మరియు మాక్స్ స్టేషన్ల మధ్య అంతరాయం ఏర్పడిన తర్వాత రెడ్ లైన్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. వాటిని పునరుద్ధరించయినట్టు దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలిగిందని పేర్కొంది. ప్రభావిత స్టేషన్లలో ప్రత్యామ్నాయ బస్సు సర్వీసులను అందించినట్టు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, మాక్స్ స్టేషన్ వైపు ప్రయాణించే రెడ్ లైన్లోని ప్రయాణికులను రైళ్ల నుండి బయటకు రావాలని కోరారు. ప్లాట్ఫారమ్లపై వేచి ఉన్నవారిని రైళ్లలో ఎక్కడానికి అనుమతించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంగళవారం ఉదయం 6.33 గంటలకు X లో ఒక పోస్ట్ ద్వారా రెడ్ లైన్లో సేవ పునరుద్ధరించినట్టు తెలియజేసారు. సహకరించినందుకు మెట్రో వినియోగదారులకు అధికార యంత్రాంగం కృతజ్ఞతలు తెలిపింది. కాగా, సరైన సమాచారం లేని కారణంగా చాలామంది ప్రయాణికులు తమ ఇండ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడినట్టు వాపోయారు. బిజినెస్ బే, దుబాయ్ మాల్, ఫైనాన్షియల్ సెంటర్, ఎమిరేట్స్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మ్యాక్స్, ఎడిసిబి, బుర్జుమాన్, యూనియన్, రిగ్గా మొదలైన స్టేషన్లు ఈ మార్గంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









