దుబాయ్లో పునఃప్రారంభమైన మెట్రో సేవలు
- July 09, 2024
దుబాయ్: సోమవారం సాయంత్రం ఈక్విటీ మరియు మాక్స్ స్టేషన్ల మధ్య అంతరాయం ఏర్పడిన తర్వాత రెడ్ లైన్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. వాటిని పునరుద్ధరించయినట్టు దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలిగిందని పేర్కొంది. ప్రభావిత స్టేషన్లలో ప్రత్యామ్నాయ బస్సు సర్వీసులను అందించినట్టు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, మాక్స్ స్టేషన్ వైపు ప్రయాణించే రెడ్ లైన్లోని ప్రయాణికులను రైళ్ల నుండి బయటకు రావాలని కోరారు. ప్లాట్ఫారమ్లపై వేచి ఉన్నవారిని రైళ్లలో ఎక్కడానికి అనుమతించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంగళవారం ఉదయం 6.33 గంటలకు X లో ఒక పోస్ట్ ద్వారా రెడ్ లైన్లో సేవ పునరుద్ధరించినట్టు తెలియజేసారు. సహకరించినందుకు మెట్రో వినియోగదారులకు అధికార యంత్రాంగం కృతజ్ఞతలు తెలిపింది. కాగా, సరైన సమాచారం లేని కారణంగా చాలామంది ప్రయాణికులు తమ ఇండ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడినట్టు వాపోయారు. బిజినెస్ బే, దుబాయ్ మాల్, ఫైనాన్షియల్ సెంటర్, ఎమిరేట్స్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మ్యాక్స్, ఎడిసిబి, బుర్జుమాన్, యూనియన్, రిగ్గా మొదలైన స్టేషన్లు ఈ మార్గంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







