దుబాయ్లో పునఃప్రారంభమైన మెట్రో సేవలు
- July 09, 2024
దుబాయ్: సోమవారం సాయంత్రం ఈక్విటీ మరియు మాక్స్ స్టేషన్ల మధ్య అంతరాయం ఏర్పడిన తర్వాత రెడ్ లైన్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. వాటిని పునరుద్ధరించయినట్టు దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలిగిందని పేర్కొంది. ప్రభావిత స్టేషన్లలో ప్రత్యామ్నాయ బస్సు సర్వీసులను అందించినట్టు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, మాక్స్ స్టేషన్ వైపు ప్రయాణించే రెడ్ లైన్లోని ప్రయాణికులను రైళ్ల నుండి బయటకు రావాలని కోరారు. ప్లాట్ఫారమ్లపై వేచి ఉన్నవారిని రైళ్లలో ఎక్కడానికి అనుమతించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంగళవారం ఉదయం 6.33 గంటలకు X లో ఒక పోస్ట్ ద్వారా రెడ్ లైన్లో సేవ పునరుద్ధరించినట్టు తెలియజేసారు. సహకరించినందుకు మెట్రో వినియోగదారులకు అధికార యంత్రాంగం కృతజ్ఞతలు తెలిపింది. కాగా, సరైన సమాచారం లేని కారణంగా చాలామంది ప్రయాణికులు తమ ఇండ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడినట్టు వాపోయారు. బిజినెస్ బే, దుబాయ్ మాల్, ఫైనాన్షియల్ సెంటర్, ఎమిరేట్స్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మ్యాక్స్, ఎడిసిబి, బుర్జుమాన్, యూనియన్, రిగ్గా మొదలైన స్టేషన్లు ఈ మార్గంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









