బహ్రెయిన్ లో హై-అలర్ట్!
- July 03, 2015
తీవ్రవాద ముప్పు పొంచిఉన్నందున బహ్రెయిన్ రాజ్యమంతటా, ప్రత్యేకించి ముఖ్యమైన మసీదులలో పోలీసువారి పహారా తీవ్రతరం చేశారుశుక్రవారం ప్రార్ధనల నేపధ్యంలో, ప్రతి ఏరియాకు ఒక అధీకృత పోలీసు మేజర్ ఇంచార్జ్ ని నియమించారు. ఈయన, ఆయా మసీదుల యొక్క పెద్దలతో సమన్వయమై శాంతిభద్రతలను సమీక్షిస్తారు. ఈ వారాంతంలో బహ్రెయిన్ ను దాడికి లక్ష్యంగా చేసుకున్నట్టు - మతబోధకుడు, ఇస్లామిక్ స్టేట్ (IS) మిలిటెంట్ గ్రూప్ సేనియర్ ఐన షేక్ తుర్కీ ఆల్బినాలి సోషల్ మీడియా ద్వారా హెచ్చరించినట్టు సమాచారం. మే 22,29 లలో సౌదీ అరేబియా లోను, జూన్ 26న కువేట్ లోను ఆత్మాహుతి దాడులు జరిగిన సంగతి విదితమే! పోలీసు పహారాతో పాటు, వివిధ ప్రాంతాల పై నిఘా ఉంచడానికి సివిల్ డిఫెన్స్ లో తర్ఫీదు పొందిన కమ్యూనిటీ వాలంటీర్లను నియమించినట్టు కేపిటల్ గవర్నరేట్ పోలీసు డైరక్టర్ జనరల్ - బ్రిగడియర్ ఖలిద్ మొహమ్మద్ అల్ థావాదీ తెలియజేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







