ఐదేళ్లలో మిలియనీర్లకు అడ్డాగా యూఏఈ..!
- July 11, 2024
యూఏఈ: ఐదేళ్లలో ప్రతి సంవత్సరం దాదాపు 6,000 మంది మిలియనీర్లు యూఏఈ చేరుకుంటున్నారు. స్విస్ బ్యాంక్ UBS విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం.. $1 మిలియన్ కంటే ఎక్కువ ఆస్తులున్న మిలియనీర్ల సంఖ్య దాదాపు 29,866 లేదా 15 శాతం పెరిగి 2023లో 202,201 నుండి 2028లో 232,067కి చేరుకుంటుంది.ఇటీవల యూఏఈలోకి 6,700 మంది మిలియనీర్లు తరలివచ్చారు.
జర్మనీ, హంగరీ, ఖతార్, సింగపూర్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, చైనా, గ్రీస్, నెదర్లాండ్స్ మరియు యుకే కంటే యూఏఈకి మిలియనీర్ల వలసలు అధికంగా ఉన్నాయి. తైవాన్, టర్కీ, కజకిస్తాన్, ఇండోనేషియా, జపాన్ 2023 మరియు 2028 మధ్య మిలియనీర్ల అధిక శాతం వృద్ధితో ముందుంటాయని అంచనా వేస్తున్నారు.సౌదీ అరేబియాలో మిలియనీర్ల సంఖ్య కూడా 5 సంవత్సరాలలో 15 శాతం పెరుగుతుందని స్విస్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది 2023లో 351,855తో పోలిస్తే 2028లో 403,8784కి చేరుకుంతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







