ఐదేళ్లలో మిలియనీర్లకు అడ్డాగా యూఏఈ..!

- July 11, 2024 , by Maagulf
ఐదేళ్లలో మిలియనీర్లకు అడ్డాగా యూఏఈ..!

యూఏఈ:  ఐదేళ్లలో ప్రతి సంవత్సరం దాదాపు 6,000 మంది మిలియనీర్‌లు యూఏఈ చేరుకుంటున్నారు. స్విస్ బ్యాంక్ UBS విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం.. $1 మిలియన్ కంటే ఎక్కువ ఆస్తులున్న మిలియనీర్ల సంఖ్య దాదాపు 29,866 లేదా 15 శాతం పెరిగి 2023లో 202,201 నుండి 2028లో 232,067కి చేరుకుంటుంది.ఇటీవల యూఏఈలోకి 6,700 మంది మిలియనీర్లు తరలివచ్చారు.

జర్మనీ, హంగరీ, ఖతార్, సింగపూర్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, చైనా, గ్రీస్, నెదర్లాండ్స్ మరియు యుకే కంటే యూఏఈకి మిలియనీర్ల వలసలు అధికంగా ఉన్నాయి. తైవాన్, టర్కీ, కజకిస్తాన్, ఇండోనేషియా, జపాన్ 2023 మరియు 2028 మధ్య మిలియనీర్ల అధిక శాతం వృద్ధితో ముందుంటాయని అంచనా వేస్తున్నారు.సౌదీ అరేబియాలో మిలియనీర్ల సంఖ్య కూడా 5 సంవత్సరాలలో 15 శాతం పెరుగుతుందని స్విస్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది 2023లో 351,855తో పోలిస్తే 2028లో 403,8784కి చేరుకుంతుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com